ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ చిరు వ్యాపారి కూరగాయలను తాజాగా ఉండటం కోసం రోడ్దు ప్రక్కన ఉన్న మురుగునీటిలో కడుగుతున్నాడు. రోడ్డుపై పక్కన మురుగునీటిలో బెండకాయలను చేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు.