రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం తమ జట్టుకు పెద్ద బూస్ట్ను ఇస్తుందని ఇంగ్లాండ్ మాజీ ఆల్రౌండర్ మొయిన్ అలీ పేర్కొన్నారు. వారు రిటైర్ కావడం భారత జట్టుకు తీరని లోటని అన్నారు. కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం టెస్టు క్రికెట్కు పెద్ద దెబ్బ అని మొయిన్ అలీ వెల్లడించారు. ఐదు టెస్టుల సిరీస్ కోసం జూన్లో టీంఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్తోనే 2025-2027 డబ్ల్యూటీసీ ప్రారంభంకానుంది.