టీమ్ఇండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యం కోసం బరిలోకి దిగిన టీమ్ఇండియా ప్లేయర్లు దంచికొడుతున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మెరుపు సెంచరీ చేశాడు. చివరికి రోహిత్ 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లు చేసి ఔటయ్యాడు. లివింగ్స్టన్ వేసిన 29.4 ఓవర్కు ఆదిల్ రషీద్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమ్ఇండియా స్కోరు: 230/3 (32.00)