ఐపీఎల్ 2025లో జైపూర్ వేదికగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ జట్టు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించారు. కోహ్లీ 39 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసుకున్నారు. టీ20ల్లో కోహ్లీ 100వ హాఫ్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించారు. ఐపీఎల్లో కెరీర్లో కోహ్లీకి ఇది 58వ అర్థశతకం. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోర్ 146/1గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (58), పాడిక్కల్ (16) ఉన్నారు.