ఐపీఎల్ 2025లో జైపూర్ వేదికగా ఆదివారం ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ సాధించారు. యశస్వి జైస్వాల్ 35 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసుకున్నారు. ఐపీఎల్లో కెరీర్లో యశస్వి జైస్వాల్కు ఇది 11వ అర్థశతకం. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి RR స్కోర్ 104/1గా ఉంది. క్రీజులో పరాగ్ (30), యశస్వి జైస్వాల్(56) ఉన్నారు.