గత కొద్ది రోజులుగా పశ్చిమ బెంగాల్ వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా కొంతమంది దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ దాడుల్లో ఇప్పటికే వందల మంది గాయపడ్డారు. వందలాది మంది హిందువులు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ముర్షిదాబాద్ హింసలో మరణించిన ముగ్గురు వ్యక్తుల కుటుంబానికి సీఎం మమతా బెనర్జీ రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.