గుజరాత్ లోని ఓ టీ దుకాణంలో పనిచేస్తున్న కార్మికుడికి ఐటీ శాఖ రూ.115 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. ఆసీఫ్ మహమ్మద్ అనే వ్యక్తి గిర్ సోమనాథ్ లోని ఓ హోటల్లో 25 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. నెలకు రూ.10 వేల జీతం వస్తున్నట్లు ఆసీఫ్ తెలిపాడు. బ్యాంక్ ఖాతాలో రూ.475 నగదు ఉన్న తనకు రూ.115 కోట్లు చెల్లించాలని నోటీసులు రావడం చూసి ఆందోళనకు గురయ్యానన్నాడు.