TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రూ 20.19 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బేస్మెంట్ పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రూ. 20.19 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. మొదటి విడతలో పైలట్ ప్రాజెక్ట్ కింద మంజూరు చేసిన 70,122 ఇళ్లలో బేస్మెంట్ పూర్తి చేసుకున్న 2019 మందికి రూ.లక్ష చొప్పున రూ 20.19 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు.