పాకిస్తాన్పై ప్రతిదాడిగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అభినందించింది. దేశ ఆత్మగౌరవాన్ని, ధైర్యాన్ని పెంచిందంటూ ప్రశంసించింది. మోహన్ భగవత్, దత్తాత్రేయ హోసబలే పేర్లతో ఈ ప్రకటన వెలువడింది. దేశ భద్రతకోసం ఉగ్రవాదులు, పాకిస్తాన్పై దాడి తప్పనిసరి అని పేర్కొంది. ప్రజలందరూ దేశభక్తిని ప్రదర్శించాలని పిలుపునిచ్చింది. సైన్యం, ప్రభుత్వం యంత్రంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.