ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పల్నాడు జిల్లా అచ్చంపేట-మాదిపాడుకు రాకపోకలు నిలిచిపోయాయి. అచ్చంపేట ప్రధాన రహదారిపై నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు, విద్యార్థులు ఉన్నారు.