భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ను అందుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ దీన్ని ప్రధానికి ప్రదానం చేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా 2019లోనే మోదీకి ఈ అవార్డును ప్రకటించారు. దీన్ని స్వీకరించడం గౌరవంగా ఉందని, భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.