భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ను భారత క్రికెట్ బోర్డు ఘనంగా సత్కరించనుంది. ఈ సందర్భంగా శనివారం జరగబోయే వార్షికోత్సవంలో సచిన్కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ పురస్కారం అందజేయనున్నట్లు పీటీఐకి బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. 'సీకే నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును సచిన్కు ప్రదానం చేయనున్నాం. భారత క్రికెట్కు ఆయన అందించిన సేవలు అమోఘం' అని పేర్కొన్నారు.