భారత్, పాక్ యుద్ధం కారణంగా కేంద్రం సెలవులు రద్దు చేసింది. దీంతో పారా మిలిటరీ జవాన్లు తిరిగి విధుల్లో చేరుతున్నారు. ఈక్రమంలో ఓ జవాన్ ఇంటిని వీడుతూ తన బిడ్డకు ముద్దు పెట్టి బాధతో వెళ్లిపోయిన వీడియో వైరలవుతోంది. కుటుంబాన్ని వీడాలని లేకున్నా దేశం కోసం జవాన్లు అందరూ ఇలా తమ కుటుంబాలను వదిలి బార్డర్లకు వెళ్తున్నారు. వీళ్లది అందరిలాంటి జాబ్ కాదని, దేశం కోసం ప్రాణాలనైనా అర్పిస్తారంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.