మునిపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై గా రాజేష్ నాయక్ గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఎస్సైగా పనిచేసిన వి సురేష్ మర్పల్లి పోలీసు స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నేరాలను అదుపులో ఉంచడానికి, తన వంతు కృషి చేస్తానని అన్నారు.