రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. వట్పల్లి మండలం పోతుల బోగడ గ్రామంలో రెవెన్యూ సదస్సును గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు భూభారతి చట్టంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్న దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.