జిల్లాలో అసంపూర్తిగా ఉన్న మన ఊరు మనబడి అదనపు గదుల పనులు పాఠశాల ప్రారంభం నాటికి పూర్తి చేయాలని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ ప్రధాన కార్యదర్శి రామచందర్ బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. చాలా పాఠశాలలో అదనపు గదులు అసంపూర్తిగా ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అధికారులు స్పందించాలని కోరారు.