సంగారెడ్డి పట్టణంలోని దాసాంజనేయ మందిరంలో శనివారం రాత్రి హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. రాత్రి 9 నుంచి 10 గంటల వరకు గంటపాటు భక్తులు 11 సార్లు హనుమాన్ చాలీసాను చదివారు. అనంతరం హనుమంతునికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారికి మంగళహారతులు, మహా నైవేద్యం సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.