టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్ లో జరిగిన రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షా సమావేశంలో మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో కలిసి నారాయణఖేడ్ శాసనసభ్యులు పట్లోళ్ల సంజీవరెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు ఎన్నికలకు సంబంధించి పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలు, కార్యక్రమాల గురించి కొన్ని సలహాలు, సూచనలు చేశారు.