నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపేట్ మండల్ పరిధిలోని రామోజీపల్లి గ్రామ సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రవికి కిడ్నీ మార్పిడి జరిగింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన విషయం ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలుసుకొని, రవి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. ఎమ్మెల్యేతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారాగౌడ్, రమేష్ చౌహాన్, కాంగ్రెస్ నాయకులు, పెరిమళ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.