నారాయణఖేడ్ పట్టణంలో గురువారం డీఎంహెచ్ఓ డాక్టర్ గాయత్రి దేవి పలు ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేశారు. పట్టణ శివారులోని పంచగామ కమాన్ వద్ద ఉన్న సిటీ స్కాన్ సెంటర్ కు అనుమతులు లేని కారణంగా సీజ్ చేసినట్లు ఆమె చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.