నారాయణఖేడ్: తాగిన మత్తులో 100 కు కాల్.. కేసు నమోదు

69చూసినవారు
నారాయణఖేడ్: తాగిన మత్తులో 100 కు కాల్.. కేసు నమోదు
తాగిన మత్తులో తన పేరు, ఊరు పేరు మార్చుకుంటూ 6 నెలలలో 77 సార్లు 100 కు కాల్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సిర్గాపూర్ ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సిర్గాపూర్ మండలం, పెద్ద ముబారక్ పూర్ గ్రామానికి చెందిన నాయకిని సురేష్ ప్రతి రోజూ సాయంత్రం తాగిన మత్తులో రోజుకొక ఊరు పేరు చెప్పుకుంటూ చనిపోతున్న, అర్జెంట్ ఉందని, భార్య తప్పిపోయిందని, నేను మందు తాగిన అని, పెట్రోల్ పోసుకున్న అంటూ విధులకు ఆటంకం కలిగించినందున కేసు నమోదు చేయడం జరిగింది అన్నారు.

సంబంధిత పోస్ట్