నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండలం దామరచెరువు గ్రామంలో శ్రీ మైసమ్మ తల్లి మరియు పోచమ్మ తల్లి వారి బోనాల కార్యక్రమంలో నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు మాజీ జడ్పీటీసీ నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్, మాజీ ఆత్మ చైర్మన్ దిలీప్ కుమార్, మాజీ సర్పంచులు మల్లేశం, ఈశ్వర్, మాజీ ఉపసర్పంచ్ సంగయ్య, నాయకులు సాయిలు, తదితరులు ఉన్నారు.