నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపేట్(ఆ) మండలంలోని కోళ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ రోమాల మాణిక్యం తమ్ముడు రోమాల మొగులయ్య గుండెపోటుతో మరణించడంతో అతని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి పరామర్శించారు. ఆయనతో పాటు మండల మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రమేష్, నాయకులు భూత్కూరి సుభాష్, మూసాపేట్ మాజీ సర్పంచ్ నర్సింలు సెట్, తదితరులు పాల్గొన్నారు.