ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని మనూరు మండల విద్యాధికారి రాజశేఖర్ అన్నారు. మండలంలోని ఎల్గోయి ప్రాథమిక పాఠశాలలో కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చదివించాలని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ఉపాధ్యాయులు దశరథ్, సాయి కృష్ణ, సి ఆర్ పి రాజు పాల్గొన్నారు.