సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలను జరిపించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొక్కొండ శ్రీశైలం గురుస్వామి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం చేశారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగింది.