సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద నివాసి ఎస్ గణపతి గత కొన్ని రోజులుగా జిల్లా దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షులుగా కొనసాగుతూ బుధవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్ గణపతి మాట్లాడుతూ తన వ్యక్తిగత కారణాల వల్లనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ముందు తను ఏ పార్టీలో చేరుతామనే విషయాన్ని ప్రకటించలేదు.