నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో శుక్రవారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు యశ్వంత్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి మరియు పిల్లలకు ఉన్నత స్థాయి విద్యను బోధించడానికి ఉపాధ్యాయులు బృందం ఉందని చెప్పారు.