సిర్గాపూర్: జొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

73చూసినవారు
సిర్గాపూర్: జొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలో శనివారం యాసంగి జొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన చివరి గింజల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటూ రైతులకు కావలసిన వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ ద్వారా అందిస్తున్నమన్నారు.

సంబంధిత పోస్ట్