సిర్గాపూర్ మండల పరిధిలోని వాసర్ గ్రామంలో శ్రీ నరేంద్ర మహారాజు పాదుక పూజా కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కసారిగా పెద్ద ఇదురు గాలులు రావడంతో అక్కడ ఏర్పాటు చేసిన టెంటు యొక్క పైపులు పైకి ఎగిరి భక్తులపై పడడంతో వారికి గాయాలయ్యాయి. నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో చేరగా ఇట్టి విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి హుటాహుటిన ఆసుపత్రి కి వెళ్లి ప్రమాదానికి గురైన వారి దగ్గరకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.