నారాయణఖేడ్ నియోజకవర్గం, మండల పరిధి సంజీవరావుపేట్ గ్రామంలో శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవ్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షేట్కార్ సహకారంతో జొన్నల కోనుగోలు కేంద్రాన్ని మహిళ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో మార్క్ ఫెడ్ సంగారెడ్డి వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రూ 3371 ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించారు అని పేర్కొన్నారు.