సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో గురువారం విద్యుత్ బిల్లు వసూలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు లైన్ ఇన్ స్పెక్టర్ బాబు, లైన్మెన్ విష్ణు పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సకాలంలో బిల్లు చెల్లించి, తమ సిబ్బందికి సహకరించాలని కోరారు. బిల్లు చెల్లించని ఎడల ఎలాంటి హెచ్చరికలు లేకుండా కనెక్షన్ తొలగిస్తామన్నారు.