నాగిలిగిద్దా మండలంలో డిసిఎంఎస్ ఏజెన్సీ ద్వారా కొనుగోలు చేసి ఏఎంసి మనూర్ లో నిల్వవుంచిన జొన్నల సంచులను శనివారం నారాయణఖేడ్ ఆర్డీఓ అశోక్ చక్రవర్తి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మనూర్ తహసీల్దార్ వెంకటస్వామి, మనూరు గిర్ధవార్ శంకర్ రెడ్డి, మండల ఏఎస్ఓ శ్రీనివాస్, మనూర్ ఏఈఓ సంగమేశ్వర్, జూనియర్ అసిస్టెంట్ ఖాజా సమీర్, డిసిఎంఎస్ సూపర్వైజర్ స్వప్న, తదితరులు ఉన్నారు.