పటాన్చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 3 టోల్ గేట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 106 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అస్సాం, ఒడిశా నుంచి 2 కార్లలో సుమారు 27లక్షల విలువ గల ఎండు గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తుండగా పటాన్చెరు సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులు రాథోడ్ బీర్బల్, రాథోడ్ సురేష్, రాథోడ్ మారుతి, రాథోడ్ ప్రకాష్ను అరెస్ట్ చేశారు.