జిల్లాలోని వివిధ చోట్ల జరిపిన తనిఖీల్లో 3. 31 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్సార్ నగర్ కు చెందిన సందీప్ నుంచి 1. 50 కిలోలు, బీరంగూడ కు చెందిన సాయికుమార్ నుంచి 1. 20 కిలోలు, మరో కేసులో 615 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.