కాజిపల్లి గ్రామంలో విషాద సంఘటన శనివారం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ కు చెందిన టిప్పర్ డ్రైవర్ రామ్ సుజన్ (38) టిప్పర్ వాహనంకు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో టిప్పర్ వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్టోన్ క్రషర్ యజమాని ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.