
రాజస్థాన్పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2025లో జైపూర్ వేదికగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. RR ఇచ్చిన 174 పరుగుల లక్ష్యాన్ని RCB జట్టు 1 వికెట్ కోల్పోయి 17.3 ఓవర్లలో ఛేదించింది. RCB బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(62*), ఫిల్ సాల్ట్(65) అర్థశతకాలతో రాణించారు. RR బౌలర్లలో కుమార్ కార్తికేయ ఒక వికెట్ తీశారు.