సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం పారిశ్రామిక వాడలోని ప్రీతం ఆర్ఎంసి రెడీమిక్స్ పరిశ్రమ డ్రైవర్ గా మసూర్ అస్లాం పనిచేసేవాడు. కాగా కొన్ని కారణాలవల్ల డ్రైవర్ గా మానేశాడు. రావలసిన రెండు నెలల వేతనాన్ని పరిశ్రమ యజమాన్యం ఇవ్వకపోవడంతో శ్రమశక్తి అవార్డు గ్రహీత బిఆర్టియు రాష్ట్ర నాయకుడు రవి సింగ్ ను ఆశ్రయించాడు. రవి సింగ్ చొరవతో మంగళవారం పరిశ్రమ యాజమాన్యం డ్రైవర్ మసూర్ అస్లంకు వేతనాన్ని అందజేశారు.