సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సును జిన్నారం ఎస్సై నాగలక్ష్మి నిర్వహించారు. అపరిచితుల నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయద్దని, ఆన్లైన్ మోసాల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి, రాజిరెడ్డి, జగన్ రెడ్డి, గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.