సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ నుండి పటాన్ చెరు వరకు సిఐటియు పటాన్ చెరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో
బైక్ ర్యాలీ నిర్వహించారు. సామాజిక న్యాయ సాధన వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం బైక్ ర్యాలీ నిర్వహించినట్లు సిఐటియు నాయకులు తెలిపారు. శ్రమ దోపిడి, సామాజిక అణిచివేత, వివక్షత అంతంకై పోరాడుదామని నాయకులు పిలుపులిచ్చారు.