కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ పటాన్ చెరు తహసిల్దార్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన రైతు భరోసా నిధులు ఇప్పటివరకు వేయలేదని విమర్శించారు. అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.