గుమ్మడిదల మండల కేంద్రంలో సీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కాబడీ, వాలీబాల్ క్రీడా పోటీలను జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవ రావు, డీఎస్పీ రవీందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీజీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలను కొనియాడారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో ఈ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కబడ్డీ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.