సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు అభివృద్ధి పనులకు నిధుల మంజూరు చేయాలని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ అనిల్ కుమార్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ వినతి పత్రం అందజేశారు. పలు కాలనీలలో 50 లక్షల రూపాయల వ్యయంతో కూడిన నూతన సీసీ రోడ్ల నిర్మాణం కొరకైన ప్రతిపాదన పెండింగులో ఉందన్నారు. వెంటనే నూతన సీసీ రోడ్ల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని కోరారు.