జిన్నారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ తల్లి గుడి నిర్మాణానికి శనివారం పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ లక్ష రూపాయలు విరాళం అందజేశారు. పోచమ్మ నూతన గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరు సాయం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డి, మాజీ వార్డ్ సభ్యులు లింగం, మల్లేష్, శేఖర్, రాము, వెంకటేష్ తదితరులు ఉన్నారు.