రుద్రారంలోని ప్రభుత్వ పాఠశాలలో ‘బ్రదర్ హుడ్ డే’ని ఇటీవల గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థి విభాగం చరైవేతి నిర్వహించింది. గీతం ఆతిథ్య విభాగం ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం, బాలల మనస్సులో సామాజిక అవగాహన, ఐక్యత, కరుణను పెంపొందించేందుకు లక్ష్యించారు. ఔట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా నోటి ఆరోగ్యం, పరిశుభ్రతను ప్రోత్సహించడానికి మహేశ్వర మెడికల్ కళాశాల వైద్యులతో ఉచిత దంత వైద్య శిబిరం గురువారం నిర్వహించారు.