
వనజీవి రామయ్య కన్నుమూత
TG: మొక్కల ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహిత వనజీవి రామయ్య(87) కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇంటిపేరునే వనజీవిగా మార్చుకున్న రామయ్య కోటికిపైగా మొక్కలను నాటారు. 2017లో కేంద్రం రామయ్యను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి.