అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో కోటి రూపాయల విలువైన అభివృద్ధి పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆయన మాట్లాడుతూ. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మున్సిపల్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. 8 లక్షల నిధులతో రెండు అంగన్వాడీ కేంద్రాలను రెనోవేషన్ చేసిన కోకో కోల సంస్థను అభినందించారు.