
పాకిస్తాన్కు పొంచి ఉన్న మరో ముప్పు
భారత్ నుంచి పాకిస్తాన్కు మరో ముప్పు పొంచి ఉంది. జమ్మూలో కురుస్తున్న అకాల వర్షాలకు చినాబ్ నదిలో నీటి ప్రవాహం పెరిగింది. సలాల్, బాగ్లీహర్ డ్యాముల నుంచి రెండు గేట్లు ఎత్తివేయడంతో దిగువకు నీరు పోటెత్తింది. దీంతో పాకిస్థాన్లోని లోతట్టు ప్రాంతాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇంకా పంజాబ్ ప్రావిన్స్లో వ్యవసాయ భూములు, గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది.