డంప్ యార్డ్ నిర్మాణ పనులు విరమించుకోవాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిదురుప్ప గ్రామంలో ఆయన మాట్లాడారు. ప్యారా నగర్ లో డంపు యార్డు నిర్మాణ పనులు విరమించుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. నిరసన ర్యాలీ చేపట్టిన నాయకులను అరెస్టు చేయడం సరికాదన్నారు. అక్రమ అరెస్టుతో భయపడేది లేదని, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు.