గురుకుల పాఠశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించుకోరుకు హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ లో జరుగుతున్న మహా ధర్నాకు తరలుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి దంపతులను పోలీసులు పటాన్చెరులోని వారి నివాసంలో శుక్రవారం హౌస్ అరెస్టు చేశారు. జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ శాంతియుతంగా ధర్నాకు వెళ్తున్న తమను హౌస్ అరెస్టు చేయడం అన్యాయమని చెప్పారు.