పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న ఓ హోటల్లో భోజనం చేసే సమయంలో కర్రీలో ఈగలు వచ్చిన సంఘటన బుధవారం జరిగింది. భోజనం చేద్దామని ముగ్గురు న్యాయవాదులు పి. వినోద్ రెడ్డి, లక్ష్మణ్, మోసిన్ హోటల్ కు వెళ్లారు. భోజనం చేసే సమయంలో కర్రీలో ఈగలు రావడంతో హోటల్ యాజమాన్యానికి తెలుపగా, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఫోన్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేశారు.